ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని అస్వస్థతకు గురై మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నప్పటికీ ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట గ్రామానికి చెందిన లావణ్య, మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి ఎమ్మెల్యే సొంతంగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నలుగురు మృత్యువాత పడటం అందరిని కలిచివేసిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ప్రత్యేక కమిటీ ద్వారా దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థికసాయంతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేయనుందని వెల్లడించారు. వారి పిల్లల చదువులను కూడా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు స్పందించి మిగిలిన వారికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారన్నారు.
మంత్రి నిమ్స్ దవాఖానకు వెళ్లి బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు. అలాగే తమ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ గ్రామంలో వారికి సొంత ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చారని, వారి పిల్లలు చిన్నగా ఉన్నందున వారు పద్దైన తరువాత పాఠశాల విద్యంతా తన సొంతగా చెప్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రి హరీష్రావు ఇబ్రహీంపట్నం, యాచారం ఆస్పత్రులను సందర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు నర్మద, కృపేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సహకార సంఘం చైర్మన్ సుదర్శన్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీలత, భాను, జగన్, నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, అల్వాల వెంకట్రెడ్డి, ముత్యాల చిన్న, భరత్కుమార్, యాచారం రవీందర్, బర్ల జగదీశ్, చీరాల రమేశ్, బుగ్గ రాములు, సర్పంచ్లు పెర్క వినోద, బాలరాజు, జెర్కోని రాజు, మైలారం విజయ్కుమార్, వీరేశ్, విజయ్, నల్ల ప్రభాకర్, బద్రినాథ్గుప్తా పాల్గొన్నారు.