రంగారెడ్డి, జనవరి 16(నమస్తే తెలంగాణ): 558 గ్రామ పంచాయతీలు.. 16 మున్సిపాలిటీలు.. 11 రోజులు.. 5,09,849 దరఖాస్తులు.. 1,439 మంది ఆపరేటర్లు.. వెరసి గడువుకు ముందే ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ముగించారు. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలో ప్రజాపాలన కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఐదు పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా.. జనవరి 7 నుంచి వాటిని ఆన్లైన్లో నమోదు చేయించారు. 17 వరకు గడువు ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం గడువు కు ఒక్కరోజు ముందుగానే మంగళవారం నాటి కే ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసిం ది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తుల ఆన్లైన్ సందర్భంగా అక్కడక్కడా కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆపరేటర్ల కొరత సైతం దరఖాస్తుల నమోదుకు ప్రతిబంధకంగా మా రింది. వీటన్నింటిని జిల్లా యంత్రాం గం అధిగమించి అనుకున్న సమయానికే దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసింది. జిల్లాలో 21 మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల పరిధిలో 2,46,626 కుటుంబాలున్నాయి. వీటి పరిధిలో 2,95,060 దరఖాస్తులొచ్చాయి. అలాగే 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 2,88,361 కుటుంబాలుండగా..2,14,789 దరఖాస్తులొ చ్చాయి.
ఉపాధిహామీ, సెర్ప్, మండల, రెవెన్యూ, విద్యాశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న జూనియర్ అసిస్టెం ట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టారు. కొంతమంది ఆపరేటర్లను ప్రైవేటుగా నియమించి దరఖాస్తులను కంప్యూటరీకరించారు. దరఖాస్తులోని 27 అంశాలను పథకా ల వారీగా పకడ్బందీగా నమోదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియ ముగియడంతో అధికారుల బృందాలు ఇంటింటి సర్వే ద్వారా దరఖాస్తుల పరిశీలనను చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో! తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేరంటూ ఏమీలేదు. అయితే ప్రజలు ఆసక్తి చూపిన ఆధారంగా..దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలకే దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ బండను అందించనున్నారు.
గృహ జ్యోతిలో ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వనున్నారు. తదుపరి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, చేయూత దరఖాస్తులున్నట్లు తెలుస్తున్నది. అభయహస్తం ఐదు పథకాలతోపాటు రేషన్ కార్డు, ఇతర వ్యక్తిగత లబ్ధికి సంబంధించి తెల్లకాగితంపై విజ్ఞప్తులు వచ్చాయి. ఈ తరహా దరఖాస్తులు అర్బన్, రూరల్ ఏరియాలో కలిపి మొత్తం 95,886 వచ్చాయి. ప్రస్తుతానికి అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక మరో దఫా సర్వే చేసి అర్హుల పేర్లను పోర్టల్లో ఉంచుతారని అధికారవర్గాలు చెబుతున్నాయి.