హైదరాబాద్, ఆట ప్రతినిధి మే 30: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ వేడుకలు సరూర్నగర్, గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. 33 జిల్లాల నుంచి వివిధ రకాల్లో క్రీడల్లో పాల్గొని క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. సీఎం కప్ రాష్ట్ర ఖోఖో చాంపియన్షిప్ సెమీ ఫైనల్స్లోకి హైదరాబాద్ జిల్లా జట్టు ప్రవేశించింది. జింఖానా మైదానంలో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో హైదరాబాద్ జిల్లా 14-13 పాయింట్ల తేడాతో మహబూబ్నగర్ జిల్లా జట్టు పై విజయం సాధించింది. బాలికల క్వార్టర్ ఫైనల్స్లో హైదరాబాద్ జిల్లా 5-4 పాయింట్ల తేడాతో మహబూబ్నగర్ జిల్లా జట్టు పై విజయం సాధించింది.
హోరాహోరిగా..
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు వాలీబాల్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో భువనగిరిపై ములుగు జట్టు, సూర్యాపేట పై వికారాబాద్, హనుమకొండపై ఆదిలాబాద్, సిరిసిల్ల పై రంగారెడ్డి, సిద్దిపేట పై జనగాం, మేడ్చల్ పై యాదాద్రి, గద్వాల్ పై వికారాబాద్, నల్లగొండపై నారాయణపేట, నాగర్ కర్నూల్ పై జగిత్యాల, నిర్మల్ పై వనపర్తి, కుమ్రంభీం పై మహబూబ్బాద్ జట్లు విజయం సాధించాయి. అలాగే మహిళా విభాగంలో మంచిర్యాల పై వరంగల్, కొత్తగూడెం పై హైదరాబాద్, నాగర్ కర్నూల్ పై కరీంనగర్, హనుమకొండ పై కొత్తగూడెం, మహబూబ్నగర్ పై మహబూబ్బాద్, జగిత్యాల పై గద్వాల్, భువనగిరిపై నాగర్ కర్నూల్, భూపాలపల్లి పై వికారాబాద్, మెదక్ పై సూర్యాపేట, హనుమకొండపై వనపర్తి, మేడ్చల్ పై మహబూబ్బాద్, గద్వాల్ పై జనగాం, సిద్దిపేట పై నిజామాబాద్ విజయం సాధించాయి. కబడ్డీ మహిళా విభాగంలో నిజామాబాద్ పై భద్రాది కొత్తగూడెం, వనపర్తి పై ఆదిలాబాద్, ములుగు పై నల్లగొండ, మంచిర్యాల పై సూర్యాపేట విజయం, నాగర్ కర్నూల్పై జనగాం, మహబూబాబాద్ పై రంగారెడ్డి, హనుమకొండపై కామారెడ్డి, హైదరాబాద్ పై ఖమ్మం, వరంగల్ పై మేడ్చల్, ఆదిలాబాద్ పై కొత్తగూడెం, వికారాబాద్ పై వనపర్తి, జగిత్యాలపై మహబూబ్నగర్, కబడ్డీ పురుషుల విభాగంలో నారాయణపేట పై గద్వాల్, కొత్తగూడెం పై రంగారెడ్డి, వనపర్తిపై నల్గొండ, ఖమ్మం పై మేడ్చల్ విజయం, సంగారెడ్డిపై సూర్యాపేట, సిద్దిపేట పై యాదాద్రి, హైదరాబాద్ పై జనగాం, జగిత్యాల పై సిరిసిల్ల, జగిత్యాలపై వరంగల్, పెద్దపల్లి పై ములుగు విజయం సాధించాయి.