ఆదిబట్ల, ఏప్రిల్ 23: రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆదిబట్ల సీఐ రవికుమార్ అన్నారు. గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ కంపెనీలో సైబర్క్రైం, డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణ, వాహనాల సంరక్షణ, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రమాదాల అనంతరం గోల్డెన్ అవర్లో చికిత్స అందింస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. అదేవిధంగా సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. డ్రగ్స్ వలన కలిగే నష్టాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెంట్ ధరించడం, మధ్యం సేవించి వాహనం నడపకూడదని సూచిస్తూ ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలని కోరారు. కార్యక్రమంలో యస్ఐ సత్యనారాయణ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.