హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలం కనకమామిడి సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ హైవేపై తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు మృతిచెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతు చనిపోయారని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ప్రమాదం ధాటికి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.