ధారూరు : ఒగ్గు డోలు కళాకారుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ధారూరు మండల పరిధిలోని అంపల్లి గ్రామంలో గత 25రోజుల పాటు జిల్లా స్థాయి ఒగ్గుడోలు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ మామిడి గారి అపూర్వ సహకారంతో శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఒగ్గు కళాకారులతో కలిసి డోలు కొట్టి కళలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు. గత ప్రభుత్వ హయంలో అంతరించిపోయిన ఒగ్గుడోలు కళాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తునదన్నారు. గొల్ల కుర్మల వారసత్వ ఒగ్గుడోలు కళకు రాష్ట్ర తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఎంతో గుర్తింపునిస్తుందన్నారు.
లేబర్ ఇన్సూరెన్స్ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే ఆనంద్
ధారూరు మండల పరిధిలోని అంపల్లి గ్రామంలో జనసాహస్ స్వచ్ఛంద సంస్థ తరపున లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను కార్మికులకు పంపిణీ చేశారు. కార్మికుల, కర్షకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, లేబర్కార్డు ఉన్న వారు ప్రభుత్వం అందించే లబ్ధిని పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీ, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, మండల అధ్యక్షుడు రాజునాయక్, గ్రామ సర్పంచ్ చంద్రకళ బాబయ్య, ఏఎంసీ చైర్మన్ సంతోష్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుబంధు అధ్యక్షుడు పాల్గొన్నారు.