ఆమనగల్లు, జనవరి 9 : అధికారులు, ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ నేనావత్ అనిత అధ్యక్షతన జరిగింది. ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సభ్యులు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ మండల పరిధిలో మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా డీ-82 కాలువ పనులను ఆగస్టు లోగా పూర్తి చేస్తామని..భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని ఇస్తామన్నారు. అలాగే మండలంలో ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, ఎంపీటీసీలు కుమార్, సరిత, తహసీల్దార్ లలిత, ఎంపీడీవో ఫరూఖ్హుస్సేన్, సీడీపీవో సక్కుబాయి, ఎంఈవో సర్దార్నాయక్, మండల వ్యవసాయ అధికారి అరు ణ, మెడికల్ ఆఫీసర్ పరీక్షిత్, పశువైద్యాధికారి విజయ్కుమార్, సత్యం, వెంకట్రెడ్డి, శ్రీలత, తిరుపతి, సర్పంచ్లు పాల్గొన్నారు.