తాండూరు, ఆగస్టు 16: వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్ పెద్దేముల్ మండ లాల పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యా లయాలతో పాటు గృహాలు, రోడ్లపై ఉదయం 11.30 గంటలకు సామూహికంగా జాతీయ గీతం పాడి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
వికారాబాద్,ఆగస్టు 16: వికారాబాద్, మర్పల్లి, ధారూరు, కోట్పల్లి, బం ట్వారం, మోమిన్పేట మండలాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవా బుపేట మండలంలో ప్రజలు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆనంద్, వెస్ట్ జోన్ ఐజీ కమల్హాసన్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎస్పీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, మాజీ టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపిం చారు. వివి ధ పను ల్లో నిమగ్నమైన ప్రజలు ప్రభుత్వం నిర్ణయించిన 11:30 గంటల కు ఎక్కడి వారు అక్కడే నిలుచుండి జాతీయ గీతాన్ని ఆలపించారు.
తాండూరు: పాఠశాలలో..
వికారాబాద్: సామూహికంగా జాతీయ గీతాలాపన చేస్తున్న పోలీసు అధికారులు
కొడంగల్, ఆగస్టు 16: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు విద్యార్థులు, ప్రజలు దేశభక్తి గీతాన్ని ఆలపించారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన సామూహిక జాతీయగీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, ఎంపీపీ ముద్ద ప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధులు ఎంపీడీవో పాండు, మున్సిపల్ కమిషనర్ నాగ రాజు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పరిగి టౌన్, ఆగస్టు 16: వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం పరిగిలో సామూ హిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. ఉదయం 11.30 గం టలకు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్దఎత్తున సామూహిక గీతాలా పనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్కుమార్, జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ అరవింద్రావు, మార్కెట్కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, టీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనే యులు, ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.
కులకచర్ల, ఆగస్టు 16: కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు. కులకచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహికంగా జాతీయ గీతాన్ని ఆల పించడం జాతీ ఐక్యతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దోమ, ఆగస్టు16: దోమ మండలంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ ప్ర భుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.