పరిగి, డిసెంబర్ 7: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజీ పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ వరకు 18 ఏండ్లు నిం డిన వారు తప్పనిసరిగా తమ పేర్లు ఓటరు జాబితాలో నమో దు చేసుకోవాలని అన్నారు. ఫారమ్-6 ద్వారా ఓటరు నమో దు, ఫారమ్-6ఏ ద్వారా ఆధార్ లింక్, ఫారమ్-7 ద్వారా చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న వారు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
బొంరాస్పేట, డిసెంబర్ 7 : వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పరీక్షల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ అన్నా రు. బుధవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలి కల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థి నులు రెండేళ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధించారని, ఈ ఏడా ది కూడా అదేవిధంగా ఫలితాలు రావాలని అన్నారు. బొట్ల వానితండా విద్యార్థినులకు పాఠశాలలోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, ఇప్పటి నుంచే శ్రద్ధగా చదువుకోవాలని సూ చించారు. క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థినులను బాగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్ను పూర్తిచేసి రివిజన్ను ప్రారంభిం చా లని సూచించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యే క శ్రద్ధవహించాలని కోటాజీ సూచించారు. కార్యక్ర మంలో పాఠశాల హెచ్ఎం విక్రంసింగ్ రాథోడ్ పాల్గొన్నారు.