షాద్నగర్టౌన్, ఆగస్టు 21: శ్రావణ మాసం నాగుల, గరుడ పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయా దేవాలయాల వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం ఆవరణలోని పుట్ట వద్ద సోమవారం మహిళలు, యువతలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి దేవాలయం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు, పుట్ట వద్ద పూజలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. అదే విధంగా గరుడ పంచమిని పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న గరుడ దేవుడికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు అంతయ్య, నర్సింహ్మ, ప్రతాప్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు కిశోర్, నాయకులు రమేశ్, లక్ష్మణ్, రాఘవేందర్, వెంకట్రావు పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని ఉత్తర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి పూజలు నిర్వహించాచరు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పాల్గొన్నారు. షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ దంపతులు శ్రీరామలింగేశ్వర స్వామికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కడ్తాల్ : మండల వ్యాప్తంగా గ్రామాల్లో సోమవారం నాగుల పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగదేవతలకు మహిళలు పంచామృతాలతో అభిషేకాలు, హారతీ, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గల మైసమ్మతల్లి ఆలయ ఆవరణలోని పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
మొయినాబాద్ : మహిళలు ఉదయాన్నే పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేశారు. పుట్టలో పాలు వేసి నాగదేవతకు పూజలు చేశారు. మండల వ్యాప్తంగా పూజలు నిర్వహించారు.
అబ్దుల్లాపూర్మెట్ : అబ్దుల్లాపూర్మెట్ పరిసర గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మహిళలు, యువతులు, భక్తులు పరసరాల్లోని పుట్టలకు పూజలు చేసి పాలు పోశారు. ఉదయం నుంచి ఆలయాలు, రహదారుల వెంట పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. గండిమైసమ్మ ఆలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.