తుర్కయాంజాల్, ఏప్రిల్ 18 : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఈఈ హరీశ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.