హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్లో రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ సభ్యుడు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పరిశీలించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ ఇతర నాయకులతో కలిసి హైటెక్స్ లో పర్యటిస్తూ..ఏర్పాట్లపై తగు సూచనలు చేస్తున్నారు.
ఆదివారం కూడా పర్యటిస్తూ..ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. 20 సంవత్సరాలపార్టీ ఉత్సవాలను తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అట్లాగే రేపు జరిగే ప్లీనరీ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఎంపీ రంజిత్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు వున్నారు.