కడ్తాల్, జనవరి 22 : సంఘ సంస్కర్త, విశ్వగురు బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని హన్మాన్ఘడ్ ఆవరణలో మండల వీరశైవ లింగాయత్-లింగ బలిజ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. విగ్రహ ఆవిష్కరణకు ముందు స్థానిక శివాలయంలో బసవేశ్వరుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం నుంచి హన్మాన్ఘడ్ వరకు శోభాయాత్రను నిర్వహించారు.
సంప్రదాయ భజనలు, కీర్తనలను ఆలపిస్తూ కోలాటాలతో నృత్యాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప సంస్కర్త, అభ్యుదయవాదని, పన్నెండవ శతాబ్దంలోనే బసవేశ్వరుడు కుల, వర్ణ, లింగ వివక్ష లేని సమసమాజ స్థాపనకు కృషి చేశారని వివరించారు. సమాజంలో సమానత్వం కోసం బసవేశ్వరుడు ఎన్నో గ్రంథాలను రచించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్బండ్పై రూ.70 లక్షలతో బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, కోకాపేటలో ఎకరా స్థలాన్ని కేటాయించి రూ.10 కోట్లతో వీరశైవ లింగాయత్ ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్-లింగ బలిజ సమాజం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ రూ.10 లక్షలు మంజూరు చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, ఆధ్యాత్మిక గురువు సూర్యనారాయణమూర్తి, ఆచారి, వీరశైవ లింగాయత్-బలిజ లింగ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, గౌరవాధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, మహిళా అధ్యక్షురాలు శెట్టి మంజుల, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వీరశైవ లింగాయత్ మండల గౌరవాధ్యక్షుడు చాట్ల సర్వేశ్వర్, మండలాధ్యక్షుడు నేతి ఈశ్వరప్ప, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్గౌడ్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, వెంకటేశ్వరశర్మ, శేఖర్ అయ్యగారు, మల్లప్ప, శరణుబసప్ప, సాంబయ్య, ఎన్ఆర్ఐ నరేశ్, డాక్టర్ రమేశ్, లింగప్ప, జ్ఞానేశ్వర్, విద్యాసాగర్, రాజు, గోపాల్రెడ్డి, చందోజీ, హన్మానాయక్, శ్రీనివాస్గౌడ్, గౌరిశంకర్ పాల్గొన్నారు.