కడ్తాల్, డిసెంబర్ 6 : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతోపాటు పరిధిలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీలు, కుల, యువజన సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మధుసూదనాచారి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, గ్రామాధ్యక్షుడు నర్సింహ, ఎంపీటీసీలు మంజుల, ప్రియ, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్బాబా, ఉప సర్పంచ్లు రామకృష్ణ, పాండు, వార్డు సభ్యులు భిక్షపతి, రామచంద్రయ్య, నాయకులు భాస్కర్రెడ్డి, హన్మానాయక్, జహంగీర్అలీ, రాఘవేందర్, చెన్నయ్య, భిక్షపతి, యాదయ్య, పాండు, మహేశ్, కృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.
యాచారం : ప్రజాప్రతినిధులు, దళితసంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో ఎంపీపీ సుకన్య నివాళులర్పించారు. కొత్తపల్లి, నందివనపర్తి, గున్గల్, తులేఖుర్ధు, తాటిపర్తి తదితర గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు.
మొయినాబాద్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వాదులు ఘన నివాళులర్పించారు. మొయినాబాద్, సురంగల్, హిమాయత్నగర్, నక్కలపల్లి, తోలుకట్టా, చిన్నమంగళారం, పెద్దమంగళారం, అజీజ్నగర్, మేడిపల్లి, అమ్డాపూర్, ముర్తుజాగూడ, చిలుకూరు, అప్పోజిగూడ, రెడ్డిపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం, చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్నిపంచారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పలువురు సర్పంచ్లు అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాయపోల్, దండుమైలారం, ముకునూరు, ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడ, పోచారం గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా నేటి యువత
మంచాల : ఆరుట్ల, జాపాల, మంచాల తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చీరాల రమేశ్, పున్నం రాము, నూతనగంటి శేఖర్, ఎడుమ నరేందర్రెడ్డి, బద్రారెడ్డి, బాల్రాజ్, ఆవుల మల్లేశ్, మహేశ్ గౌడ్, యాట దశరథ, సంజీవ, మంథని మల్లయ్య పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. పట్టణ ముఖ్య కూడలి, అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, రాజేశ్వర్, నాయకులు జూపల్లి శంకర్, యుగేందర్, నందకిశోర్, చెట్ల నర్సింహులు, శ్రీనివాస్, యాదగిరి, మూర్తి పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : వివిధ గ్రామాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్ సులోచనాఅంజన్గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఆలూర్, కౌకుంట్ల, హస్తేపూర్, తల్లారం, దుద్దాగు తదితర గ్రామాల్లో నివాళులర్పించారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.
పెద్దఅంబర్పేట : సీపీఐ అబ్దుల్లాపూర్మెట్ మండల సమితి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధి రావినారాయణరెడ్డి కాలనీలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అంబేద్కర్ అందరికీ ఆదర్శమని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ అజ్మీర్ హరిసింగ్నాయక్, నర్సింహ, పుల్లయ్య, నవనీత, అరుణ, నారాయణరెడ్డి, సైదులు, దేవమ్మ, క్రాంతి, వినోద్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి ప్రధాత అని యువజన సంఘం మండల అధ్యక్షుడు వగ్గు మహేశ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్, మీసాల రమేశ్, అరుణ్, సాయి, రాజు, లండం మల్లేశ్ పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.షాబాద్, నాగరగూడ, హైతాబాద్, బోడంపహాడ్, మన్మర్రి, కుమ్మరిగూడ తదితర గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ముక్కు విశ్వం, సంజీవ, యాదయ్య, నర్సింహులుగౌడ్, రాములు, ప్రభాకర్, దయాకర్ తదితరులున్నారు.
తుర్కయంజాల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్లో అంబేద్కర్ వర్ధంతిని ఇంజాపూర్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మల్లెల ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు హాజరై నివాళులర్పించారు. అదేవిధంగా కమ్మగూడ వివేకానంద్ చౌరస్తాలో వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కోశికె అయిలయ్యగౌడ్, కౌన్సిలర్ బొక్క రవీందర్రెడ్డి, ఇంజాపూర్ మాజీ ఉప సర్పంచ్ ధన్రాజ్గౌడ్, నాయకులు బొక్క గౌతమ్రెడ్డి, రఘు, పురుషోత్తం, బాలయ్య, బాలరాజ్, యాదయ్య పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి, చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధ్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఉప సర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశ్, మహిళా అధ్యక్షురాలు సమతారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు నారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు బండారి వెంకట్ రెడ్డి, నాయకులు అత్తెల్లి అనంతరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఎర్రవల్లి అశోక్, బండారి చంద్రాశేఖర్ రెడ్డి, భాస్కర్, జయసింహ రెడ్డి, కృష్ణ, సాయి చందు తదితరులు ఉన్నారు.
శంకర్పల్లి : అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజయ్, అశోక్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడువాలని కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని తిమ్మాపూర్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఎంపీటీసీ రాజేందర్గౌడ్తో కలిసి ఆయన నివాళులర్పించారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఇన్ముల్నర్వలో ఎమ్మార్పీఎస్ నాయకుడు పెంటనోళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాగరాజు గౌడ్, రేనట్ల నరేందర్గౌడ్, కొస్గి యాదయ్య, పట్నం చంద్రయ్య, పెద్దాపురం శ్రీనివాస్గౌడ్, గండేటి నరసింహాగౌడ్, అనిల్గౌడ్, ప్రకాశ్గౌడ్, గోవర్ధన్గుప్తా, పట్నం నరసింహాగౌడ్, కోస్గి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.