బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్సేనని.. చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో బీసీలకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రతి ఎన్నికల్లో చెబుతున్న మాయ మాటలను నమ్మి బీసీలు మోసపోతుండడంతో స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా..
రాజ్యాధికారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని బీసీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా బీసీల ఐక్యతకు ఎనలేని కృషి చేస్తున్న ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు బీసీలంతా మద్దతుగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ను పార్టీలకతీతంగా ఓట్లు వేసి గెలిపించుకుందామని చెబుతున్నారు. చేవెళ్ల నుంచే బీసీల సాధికారతకు నాంది పలుకుదామని పిలుపునిస్తున్నారు.
– రంగారెడ్డి, మే 4 (నమస్తే తెలంగాణ)
బీసీ యువకులు చైతన్యవంతులై బీసీ వర్గానికి వచ్చిన అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మన బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్కు ఓట్లు వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏ పార్టీలో ఉన్నా కాసానికి సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రతి యువకుడు కృషి చేయాలి. మన నాయకుడికిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ వాదాన్ని బలపరిచి మన సత్తా చాటుదాం.
– రాజుముదిరాజ్, యువ నాయకుడు, బ్రాహ్మణపల్లి, దోమ మండలం
ఆయా పార్టీల నాయకులు ఇన్నాళ్లుగా బీసీలను ఓట్లు కాసే చెట్లుగానే మల్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మనలో రాజకీయ చైతన్యం వచ్చేసరికి నాయకులు నాలుకలు కొరుక్కుంటున్నారు. అందుకే మన ఓట్లు మన కాసాని జ్ఞానేశ్వర్కు వేసి చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం. బీసీ బిడ్డను గెలిపించుకొని బీసీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుదాం.
– పెంటయ్య, మాజీ సర్పంచ్, బ్రాహ్మణపల్లి, దోమ మండలం
కేసీఆర్ బీసీలపై నమ్మకంతో కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. బీసీలమంతా ఒక్కతాటిపైకి వచ్చి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రతి బీసీ బిడ్డ ఆలోచించి ఓటు వేసి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయం. ఇలాంటి అవకాశం ముందుముందు రాదు. వచ్చిన సువర్ణావకాశాన్ని ప్రతి బీసీ బిడ్డ సద్వినియోగం చేసుకోవాలి.
– క్రిష్ణ, మంతట్టి
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కావాలి. కాంగ్రెస్ పార్టీని ఓడించే సమయం వచ్చిందని బీసీ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. బలహీనవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ఒక్క బీఆర్ఎస్సేనని.. ప్రతి బీసీ బిడ్డ గుర్తుంచుకోవాలి. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారే నాయకులకు గట్టి బుద్ధి చెప్పేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారు.
– రజాక్, బషీరాబాద్
పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీగా గెలుపొందడం ఖాయం. గతంలో ఎంపీలుగా గెలుపొందిన నాయకులు సొంత ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. చాలాకాలం తర్వాత చేవెళ్ల గడ్డపై ఒక బీసీ నాయకుడికి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేద్దాం.
– పోలేపల్లి పూజిత, మాజీ సర్పంచ్, అప్పారెడ్డిగూడ(షాబాద్)
ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. చేవెళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలుగా గెలిచినవారే. ప్రస్తుతం ఒక బీసీ నేతకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారే నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కాసానికి చేవెళ్ల టికెట్ కేటాయించడం సంతోషకరం.
– నక్క ఆవిలాశ్గౌడ్, కుమ్మరిగూడ, షాబాద్
బీసీలంతా ఐకమత్యంతో ఉన్నప్పుడే తమ బలం బహిర్గతమవుతుంది. బీసీలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసం చేస్తున్నాయి తప్ప తమ సమస్యలను పరిష్కరించడంలేదు. కాసానిని లోక్సభకు పంపితే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు.
– గుమ్మడి కుమార్, మైలార్దేవ్పల్లి
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మూడో వ్యక్తి. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలపరిచిన ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో విజయం సాధించారు. ఈసారి కూడా కాసాని విజయం సాధించడం పక్కా. బీసీల అభివృద్ధి కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలుజేశారు.
– విఠల్, పూలపల్లి, నవాబుపేట మండలం
ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్గా గతంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుజేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. పార్లమెంట్లో బీసీల సమస్యలను వినిపించే వ్యక్తి కాసాని. కొండా విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డి ఇద్దరు కూడా కేసీఆర్ దయతోనే గతంలో పార్లమెంట్కు వెళ్లిన సందర్భాలను మా బీసీలకు వివరిస్తున్న.
– కృష్ణాగౌడ్, పూలపల్లి, నవాబుపేట మండలం
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలి. బీసీల ఐక్యతను అందరికీ చాటిచెప్పాలి. బీసీలను విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలి. అప్పుడే బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. బీసీలంతా మన నాయకుడికి ఓట్లు వేసి గెలిపించుకుందాం.
– నీలం సురేశ్, బీసీ నాయకుడు, కొత్తగూడ
బీసీ నాయకుడిగా ఎంతో కాలంగా సేవలందిస్తున్న కాసానిని జ్ఞానేశ్వర్కు ఒక అవకాశం ఇవ్వాలి. నిస్వార్థంగా సుదీర్ఘకాలంగా ఆయన ముదిరాజ్, బీసీల సమస్యలపై పోరాడుతున్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించి పార్లమెంట్కు పంపాలి. అప్పుడే బీసీల అభివృద్ధికి ఆయన మరింత సేవలందించే అవకాశం ఉంటుంది. బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్కు కాసానిని గెలిపించి కానుకగా ఇవ్వాలి.
– రాజు ముదిరాజ్, గోపన్పల్లి
ఎంపీగా కాసాని జానేశ్వర్ ముదిరాజ్ను గెలిపిస్తాం. బీసీల గళం పార్లమెంట్లో వినిపిస్తారు. బీసీలు చైతన్యం చాటే సమయం ఆసన్నమైంది. మన ఓటు మన నాయకుడికే వేసుకోవాలి. బీసీలు అమ్ముడుపోతారని, బీసీల్లో ఐక్యత లేదని బీసీలు ఎప్పుడూ ఏకతాటిపైకి రారనే వాదనకు తెరపడాలంటే కాసానిని గెలిపించుకోవాలి.
– కాకి నర్సింహ ముదిరాజ్, కందుకూరు