పరిగి, జనవరి 6 : సీఎం కేసీఆర్ పేదల పాలిట పెద్దన్నలా వ్యవహరిస్తూ, పేదల సంక్షేమా నికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి లోని మండల పరిషత్ కార్యాలయంలో పరిగి మండలానికి చెందిన 57 మంది లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద యువతుల వివాహానికి ప్రభుత్వం ద్వారా రూ. లక్షా 116 అందిం చడం వల్ల సీఎం కేసీఆర్ ఆయా కుటుంబాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథ కాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నా యని తెలి పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో శేషగిరిశర్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
క్యాలెండర్ల ఆవిష్కరణ…
పరిగిలోని కేఎన్ఆర్ ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్, పరిగిలోని ఆయన నివాసంలో టీయూటీఎఫ్ 2023 క్యాలెండర్లను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో సదుపాయల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి అమర్నాథ్, పీఆర్ టీయూ టీఎస్, టీయూటీఎఫ్ నాయకులు వెంకటయ్య, రామాంజనేయులు, బుగ్గయ్య, గోపాల్, మధుసూదన్, వీరేశం, ఉస్మాన్, జాంప్ల, బస్వరాజ్, బాలకృష్ణ, కరుణాకర్, రూప్సింగ్, శ్రీశైలం, మంచన్పల్లి శ్రీనివాస్, నరేందర్ పాల్గొన్నారు.