ధారూరు, డిసెంబర్ 6 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. మూడు ఏండ్ల కాలంలో గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు అధికారులు ఉత్సాహంగా ప్రభుత్వం చేపట్టిన లక్ష్య సాధనకు గ్రామంలో విస్తృతంగా అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టడంతో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. గ్రామంలో ముఖద్వారం నుంచే రోడ్డుకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామ వీధుల్లో సీసీ రోడ్లు, ప్రతి ఇంటి ముందు పచ్చని చెట్టు, రాత్రి వేళల్లో కాంతులు విరాజిల్లుతున్న లైట్లు పల్లెకు శోభను అందిస్తున్నాయి. ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీలు అందంగా కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, మిషన్భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు, వ్యక్తిగత మురుగుదొడ్డి, ఇంకుడుగుంతలతో పల్లె అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది.
గ్రామంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు
గ్రామంలో 10లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు హైమాస్ట్ బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటారు. రాత్రి వేళల్లో కాంతులు విరాజిల్లుతున్న లైట్లు పల్లెకు శోభను అందిస్తున్నాయి.
పారిశుధ్య నిర్వహణతో స్వచ్ఛ వీధులు
పల్లె ప్రగతిలో భాగంగా పల్లె పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను కొనుగోలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు.
ఇంటింటికీ తాగునీరు సరఫరా
గ్రామంలో నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతున్నది.
పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రకృతి వనంతో గ్రామంలో పచ్చదనం ఏర్పడింది. ప్రతి పల్లెలో ప్రకృతి వనం. ఇందులో 16వందల మొక్కలు నాటి పెంచుతున్నారు. ప్రకృతి వనంలో కొబ్బరి, అశోక, అల్లనేరడు, చైనా బాదం, తదితర మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు. గత హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి
గ్రామంలో ప్రతి ఒక్కరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరి కృషి ఉంది. పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, సీసీ రోడ్లు, వీధిలైట్లు, తదితర అభివృద్ధి పనులు చేపట్టాం.
– పూర్ణిమ, పంచాయతీ కార్యదర్శి, మోమిన్కలాన్
పల్లె ప్రగతితో అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమంతో మా పల్లె రూపురేఖలు మారాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పల్లె ప్రగతి, 30రోజుల ప్రణాళికతో పంచాయతీ అభివృద్ధి జరిగింది. ప్రభుత్వం మరింత సహకారమందిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. గ్రామంలో వైకుంఠ ధామం, కంపోస్ట్షెడ్, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీ, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మరుగుదొడ్డి, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటిని మంచినీరు అందించడం జరుగుతుంది.
– గడ్డమీది శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్, మోమిన్కలాన్