కడ్తాల్, జనవరి 2 : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయనకు ఎమ్మెల్సీ పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.