వికారాబాద్, ఫిబ్రవరి 6 : వికారాబాద్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించే బీసీ సంఘాల చర్చా వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్హాల్లో ఉదయం 10 గంటలకు బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగనున్నది. హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట జ్యోతిబాఫూలే విగ్రహ ఏర్పాటుకు చర్చా వేదిక కార్యక్రమం జరుగుతున్నది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాల సంఘాలు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.