చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో బంగారు మైసమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ కార్యాక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి హాజరయ్యారు.
అనంతరం నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చు కోవాలని సూచించారు. దేవాలయాలకు వెళితే మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పూరతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు పంజూరు చేస్తుందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కుమ్మెర గ్రామ సర్పంచ్ బాన్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, మాజీ మండల అధ్యక్షుడు రమేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు ఉన్నారు.