షాద్నగర్, జనవరి31: అర్హులందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ దవాఖాన, తంతి తపాల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసిందని, సుమారు రూ. 10 లక్షల విలువ చేసే వైద్యాన్ని అన్ని ప్రైవేట్ దవాఖానల్లో పొందే అవకాశం ఉందని వివరించారు. సీఎం రేవంత్రెడ్డి సహితం ఆరోగ్య శ్రీ పై ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు.
పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సమాజంలో సామాజిక సేవా కార్యాక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కృష్ణ అనే దాత సర్కారు దవాఖాన నిర్మాణానికి ఆర్థికంగా సాయం చేయడం సంతోషకరమని అభినందించారు. ప్రజల అవసరాల కోసం తపాల కార్యాలయం అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ నర్సింహ, ఎంపీటీసీ అరుణ, దవాఖాన నిర్మాణ ఆర్థిక దాత కృష్ణ, వార్డు సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫరూఖ్నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ భార్గవ్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ పనితీరు ప్రపంచ దేశాలకే ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, శ్యాంసుందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, శ్రీనునాయక్, బాల్రాజ్గౌడ్, సిద్ధార్థ, రాజూనాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.