నందిగామ, ఫిబ్రవరి 26 : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం నందిగామలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పథకాలను ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు.
సంక్షేమంతో పాటు గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కొమ్ము కృష్ణ, కుమారస్వామిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు రాజ్గోపాల్, అశోక్, మాజీ చైర్మన్ జిల్లెల రాంరెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్, నాయకులు బాల్రెడ్డి, జంగ నర్సింహ, లింగం, తుమ్మల నర్సింహులు, వెంకట్రెడ్డి, బుచ్చయ్య, లింగంగౌడ్, అంజి, శివగౌడ్, శ్రీశైలం, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కొత్తూరు మండలంలోని తీగాపూర్ నుంచి ఫాతిమాపూర్ వరకు హెచ్ఎండీఏ నిధులు రూ.45 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రోడ్డు పది కాలాల పాటు ఉండేలా నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించారు. గ్రామస్తులు దగ్గరుండి రోడ్డు వేయించుకోలాన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, ఎంపీటీసీ జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు మైసగళ్ల రమేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, తీగాపూర్ ఆంజనేయులు పాల్గొన్నారు.