తాండూరు రూరల్, నవంబర్ 27: పేదల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి అన్నా రు. సోమవారం తాండూరు మండలంలోని గౌతాపూర్, చెంగోల్, చింతామణి పట్ట ణం, పర్వతాపూర్, సంకిరెడ్డిపల్లి, వీరారెడ్డిపల్లి, సిరిగిరిపేట, అల్లాపూర్ తదితర గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కావడం పక్కా అని పేర్కొన్నారు. నియోజకర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు. గత నలభై ఏండ్లల్లో చేయని అభివృద్ధిని కేవలం రెండేండ్ల కాలంలో పూర్తి చేశామని తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించా లని కోరారు. ముక్కుమొహం తెలియని వ్యక్తులకు ఓటేస్తే, అభివృద్ధి మరో నలభై ఏండ్లు వెనక్కి పోతుందన్నారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ గౌడిమంజుల, ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నరేందర్రెడ్డి, సర్పంచ్లు రాజప్ప, మల్లే శ్వరీ, ప్రభాకర్రెడ్డి, లాల్రెడ్డి, అమృత్రెడ్డి, నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీని వాస్, నాయకులు రాంలింగారెడ్డి, వీరేందర్రెడ్డి, తదితరులు ఉన్నారు.