పరిగి, జనవరి 28 : పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించేందుకే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలో ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 15 ఏండ్లుగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా మందులు సైతం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ శిబిరంలో 520 మందికి వైద్య పరీక్షలు చేయగా 100 మందికి వైద్యం చేసేందుకు ఉచితంగా పటాన్చెరువులోని టీఆర్ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు వైస్చైర్మన్ డాక్టర్ టి.రితిక్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు.