విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్మౌర్య
దౌల్తాబాద్, ఏప్రిల్ 29 : ఎలాంటి వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్మౌర్య అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండలం మాటూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.
ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన భారతదేశానికి చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతిఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రొ.ఉదయభాను, ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ మహిపాల్, సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీ మదరమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, అంబేద్కర్ మండల యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, దళిత సమాఖ్య మండల అధ్యక్షుడు మదరప్ప, నాయకులున్నారు.