యాలాల, ఏప్రిల్ 27 : బీజేపీ.. మతతత్వ పార్టీ అని తాండూరు ఎ మ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కోకట్, పడిగ్యాల, ముద్దాయిపేట, యాలాల, దేవనూర్, బెన్నూర్, జుంటుపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతతత్వ పార్టీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. నల్ల చట్టాలతో రైతుల నడ్డి విరిచిందన్నారు.
దేశాన్ని బ్రష్టు పట్టించిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. మతం, గుడి పేరుతో ఓట్లు అడగడానికి మన ముందుకొస్తున్న వారికి బుద్ధి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ అధ్యక్షుడు అ క్బర్ బాబా, శ్రీధర్, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, నాయకులు అమర్నాథ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.