ఇబ్రహీంపట్నం, ఆగష్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిసన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన తోళ్ల శివలింగంకు దళితబంధు కింద ప్రభుత్వం నుంచి మంజూరైన ఎర్టిగా కారును గురువారం క్యాంపు కార్యాలయం ఆవరణలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితబంధు పథకం ఎంతోమంది పేద దళితుల కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడుతుందన్నారు. తమకు ఇష్టమైన యూనిట్లను ఎంచుకుని నేడు ఎంతోమంది దళితులు ఆర్థికంగా ఎదుగటం సంతోషకరమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళితబంధు పథకం అందుతుందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ విఠల్రెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్, మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, సర్పంచ్ తుడుము మల్లేష్, గ్రామశాఖ అధ్యక్షుడు యాదగిరి, మండల టీఆర్ఎస్వీ అధ్యక్షుడు వినోద్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.