తుర్కయాంజాల్, అక్టోబర్ 31 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలు అనగానే అనేక పార్టీలు వస్తాయని, వారి మాయమాటలను నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. నియోజకవర్గంలో రూ.2931 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. మున్సిపాలిటీలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ ఉన్నప్పటికీ ప్రత్యేక నిధులను కేటాయించి మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. రాబోయే బీఆర్స్ ప్రభుత్వంలో సైతం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అనంతరం డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ.. ప్రజలంతా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు కీర్తన, గుండ భాగ్యమ్మ, బీఆర్ఎస్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు ఆర్ల కృష్ణ, రైతు సేవా సహకార సంఘం మాజీ డైరెక్టర్ మేతరి అశోక్, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, నాయకులు చెక్క బాల నర్సింహ, బాబయ్య, మేతరి శంకర్, పవన్ గౌడ్, కొమ్మని దయానంద్, చెక్క సుధాకర్, మల్లయ్య, కార్తిక్, అశ్వీని తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీలో కారు ప్రచార జోరు పెరిగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు సైతం బీఆర్ఎస్ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ, కొహెడలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాగన్నగూడలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కందాడి సురేందర్రెడ్డి, కొహెడలో వార్డు అధ్యక్షుడు బుడ్డ విజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కొహెడ మాజీ ఉప సర్పంచ్ కందాళ బిందు రంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మర్రి కృష్ణారెడ్డి, కందాడ నరేందర్రెడ్డి, తిరుమల్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బూర రమేశ్, యాదమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
జోరుగా బీఆర్ఎస్ ప్రచారం
మంచాల : మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. నోముల, చిత్తాపూర్, కొర్రవానితండా, సత్తితండా, మంచాల గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏర్పుల చంద్రయ్య, బొడ్డు నాగరాజుగౌడ్, గంట విజయ్, పల్నాటి బాల్రాజ్, జంబుల కిషన్రెడ్డి, మొగిలి వెంకటేశ్, పల్నాటి ప్రభాకర్, శంకర్ నాయక్, జంగయ్య, చింతకింది వీరేషం, పెద్దిరాజు, ఏర్పుల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మరింత అభివృద్ధి కోసం..
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి అన్నా రు. పోచారం గ్రామంలో మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో కారు గుర్తుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు తెలిపారు. దండుమైలారం గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ బిట్ల వెంకట్రెడ్డి, సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి ఆధ్వర్యంలో, ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడ, ఉప్పరిగూడ, రాయపోల్, దండుమైలారం, నాగన్పల్లి, నెర్రపల్లి, పోల్కంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నది. మంగళవారం మండలంలోని నల్లవెల్లి, తక్కళ్లపల్లి, గున్గల్, ధర్మన్నగూడ తదితర గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జిల్లా రాములు, ఓరుగంటి యాదయ్యగౌడ్, పాలకూర్ల లక్ష్మీపతిగౌడ్, తలారి మల్లేశ్, కాసాని రవి, బొల్లంపల్లి వెంకటేశ్, రమేశ్ తదితరులున్నారు.
అభివృద్ధ్దికే పట్టం కట్టాలి
ఆదిబట్ల : కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, కౌన్సిలర్ వనం శ్రీను అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గోపగళ్ల బాబు, కాకి రవీందర్, దేవరపల్లి శ్రీనివాస్, కాకి మహేందర్, గోదాసు మధు, ముక్కెర నారాయణ, నర్సగళ్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అనాజ్పూర్, గుంతపల్లి, మజీద్పూర్, బాటసింగారం, లష్కర్గూడ, అబ్దుల్లాపూర్, కవాడిపల్లి తదితర గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ర్టాభివృద్ధికి సిఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించారు. కారు గర్తుకు ఓటు వేసి మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంది భాస్కర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కంది ధన్సాగర్రెడ్డి, నాయకులు ఎర్రవెల్లి గౌరీశంకర్చారి, పట్టాభిచారి, పెంటాచారి, ఉమాకాంత్చారి, మోడెపు వెంకటేశ్గౌడ్, ఏసూరి జంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.