తుర్కయాంజాల్, జూన్ 13 : మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ర్టానికి తిరుగులేదని, సంక్షేమ పథకాల అమలులోనూ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాగన్నగూడ జేఎంఆర్ ఫంక్షన్హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడబిడ్డలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజకీయాల్లో భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. మహిళలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి, సీడీపీవో శాంతిశ్రీ, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి, తహసీల్దార్లు అనితా రెడ్డి, సుచరిత, ఎంపీపీలు కృపేశ్, నర్మద పాల్గొన్నారు.
మహిళా సంక్షేమంలో మనమే నంబర్ 1
షాద్నగర్ : దేశంలోనే తెలంగాణ మహిళా సంక్షేమంలో నంబర్ 1 గా నిలిచిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణం ఈడెన్ ప్లాజాలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఎస్. హరీశ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రధానంగా మహిళా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంగన్వాడీల వేతనాలు రూ. 5 వేల లోపే ఉన్నాయని, సీఎం కేసీఆర్ వచ్చాక అంగన్వాడీ టీచర్లకు రూ. 13 వేల గౌరవ వేతనాన్ని అందిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమాన్ని జరుపుకోవడం సంతోషకరమని చెప్పారు. నాడు ప్రతి వేసవి కాలంలో మంచి నీళ్ల సమస్య ఉండేదని, నే డు ఆ పరిస్థితి లేదని చెప్పారు. అప్పట్లో నాయకులకు, అధికారులకు గ్రామీణ ప్రాంత మహిళలకు ఖాళీ బిందెల స్వాగతం పలికి నిరసనలు తెలిపేవారని, వారి భయానికి గ్రామాల్లో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించేందుకు వెనుకడుగు వేసేవారని గుర్తుచేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కలెక్టర్ డాక్టర్ హరీశ్లకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. వేదిక ప్రాంగణంలో చిన్నారులు నృత్యాలు చేశారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రూ. 22.88 కోట్ల చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు. విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచిన అంగన్వాడీ టీచర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, బంగారు స్వరూప, ఎమ్మె శ్రీలత, కొత్తూరు ఎంపీపీ ప్రియాంక, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, కౌన్సిలర్లు పావని, మహేశ్వరి, ప్రతాప్రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో నాగమణి, తహసీల్దార్ గోపాల్ పాల్గొన్నారు.
ప్రభుత్వం పెద్ద పీట
చేవెళ్లటౌన్ : మహిళల సంక్షేమ, సాధికారత, భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేసీఆర్ గార్డెన్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘాలకు రూ.25 కోట్ల బ్యాంకు చెక్కులను, ఉత్తమ మహిళా అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలకు పారితోషికాన్ని ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. ఇతర అనేక సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ రావు, తహసీల్దార్లు శ్రీనివాస్, అశోక్ కుమార్, ఎంపీడీవోలు రాజ్ కుమార్, డీటీ రాజశేఖర్, శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి, ఎంపీపీలు విజయలక్ష్మి, కాలె భవాని, గోవర్దన్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జడ్పీటీసీలు కాలె జయమ్మ, మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, చేవెళ్ల వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, చేవెళ్ల సర్పంచ్ శైలజ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళలకు సముచిత స్థానం
ఆమనగల్లు : మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ఆలేటి నారాయణ ఫంక్షన్ హాల్లో ఆమనగల్లు ఐసీడీఎస్ సీడీపీవో సక్కుబాయి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అంగన్వాడీ, ఆశ, మహిళా సంఘాలలోని నియోజకవర్గ స్థాయి అధికారులు, టీచర్లు , కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. అనంతరం ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లోని మహిళా సంఘాలకు రూ.18.18 కోట్ల విలువ గల చెక్కులు, వెల్డండ మండలంలోని మహిళా సంఘాలకు రూ.10.17 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆమనగల్లు ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో ఐదుగురు దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. తదనంతరం ఆమనగల్లు మండలంలోని 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్, ఆమనగల్లు, కడ్తాల్ జడ్పీటీసీలు నేనావత్ అనురాధ, దశరథ్నాయక్, ఎంపీపీలు మనోరమ, విజయ, కమ్లీ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో ఫారూఖ్హుస్సేన్, రామకృష్ణ, తహసీల్దార్ అనిత, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, కౌన్సిలర్ కమఠం రాధమ్మ, ఎంపీటీసీ కుమార్, సర్పంచ్ లక్ష్మీనర్సింహ్మ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : శంకర్పల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రశాంత్, సంతోశ్, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.