ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 30 : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగల్పల్లి సహకారసంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోచారం గ్రామంలో రూ.1.48కోట్ల వ్యయంతో 2000మెట్రిక్ టన్నుల కెపాసిటీ కూడిన గోడౌన్ పనులను ఆదివారం డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతాంగ ప్రయోజనాలకు మొదటినుంచి పెద్దపీట వేస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పంటపెట్టుబడి కోసం రైతుబంధు, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా, ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందించటంతో పాటు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గోడౌన్లు నిర్మించనున్నామన్నారు. పోచారంలో 2000మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోడౌన్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను నీరు గారుస్తున్నప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషిచేస్తుందన్నారు. త్వరగా గోడౌన్ నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. సహకారసంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రైతులకు ఎల్టీ, పంట రుణాలు అధికంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీ కృపేశ్, మంగల్పల్లి సహకార సంఘం ఛైర్మన్ మంచిరెడ్డి మహేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, వైస్చైర్మన్ రవీందర్రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ అంజిరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు వెంకట్రెడ్డి, పుల్లారెడ్డి, సర్పంచ్ అరుణమ్మ, డైరెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, శ్యాంసుందర్, లింగారెడ్డి, బాల్రెడ్డి, యాదమ్మ, చంద్రు, అంజయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మునగనూర్ శ్రీ జయసూర్యనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధి చేయడమే ధ్యేయం అన్నారు. ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని తెలిపారు.
అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను విన్నవించగా, ఆయన వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు వి.స్వాతి, సంగీత, రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వి.అమరేందర్రెడ్డి, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కె.లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మోహన్గుప్తా, యాదయ్య, శ్రీజయసూర్యనగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాదరావు, కాలనీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.