ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24 : అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రమూ సాటిరాదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ పార్టీల నుంచి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కిషన్రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు దేశం చూపు తెలంగాణపై ఉందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకాని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని పేర్కొన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, సీఎం సహాయనిధి, దళిత బందు, బీసీ బంధుతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నదన్నారు. ఇండ్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.3లక్షలు అందించి ఆదుకుంటున్నదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యంగా రోడ్ల విస్తరణ, ఐటీ రంగ సంస్థల ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి త్వరలో సాగునీరు అందనున్నదని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యాచారం మండలం అధ్యక్షుడు రమేశ్గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వికారాబాద్ : బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమవుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసంలో వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండల పరిధిలోని కల్కొడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, వారి అనుచరులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు, గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గత పాలనలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో జరిగిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో దేశంలో నంబర్ వన్గా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇన్ని పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్పల్లి జడ్పీటీసీ మధుకర్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని.. అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే రోల్ మాడల్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ మరో పదికాలాల పాటు అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయతాత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కే ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు విడుతలవారీగా అర్హులైన వారందరికీ అందజేస్తామని.. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరి యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్, శ్రీను, ఆంజనేయులు, పరమేశ్, వెంకటయ్య, జయరాం, రమేశ్, యువజన విభాగం నాయకులు కిరణ్, అల్లాజీ, విక్రమ్, హనీఫ్, అఫ్సర్, అబ్బు, శ్రవణ్ పాల్గొన్నారు.