అబ్దుల్లాపూర్మెట్, జనవరి 29 : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బలిజగూడ, బాచారం, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో రూ. 2.59 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎంపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగి దాస్గౌడ్తో కలిసి సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రేషన్కార్డులు, పింఛన్లు రాని వారందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. అనుమతులు లేకుండా క్రషర్ యజమానులు పేలుళ్లు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బలిజగూడలో బస్సు సౌకర్యం కల్పించాలని, సర్వేనం 55,56 భూ బాధితులకు పట్టాలు ఇవ్వాలని, శ్మశాన వాటికకు దారి చూపించాలని కోరారు.
త్వరలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్రెడ్డి, సర్పంచ్లు బుర్ర వీరస్వామిగౌడ్, పారంద సంతోష, కవాడి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు దంతూరి అనిత, కేశెట్టి వెంకటేశ్, ఉపసర్పంచ్లు ఉప్పు సురేశ్, మోర ప్రభాకర్, నెమరుగోముల స్వామి, కొలన్ శేఖర్రెడ్డి, నాయకులు కొత్త ప్రభాకర్, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.