ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆయన ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ల్లాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్, మున్సిపల్ చైర్మన్లు నిరంజన్రెడ్డి, స్రవంతి, కాంగ్రెస్ నాయకులు శేఖర్గౌడ్, గురునాథ్రెడ్డి, జగదీశ్, రాములు, దాసు, జగన్, అంగత్కుమార్, అంబేద్కర్ సేవా సంఘం నాయకులు కృష్ణయ్య, మురళీ, రాజు, మహేశ్ పాల్గొన్నారు. అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సమీపంలోని స్ఫూర్తిజ్యోతి ఆశ్రమంలో అంధ విద్యార్థులకు అన్నదానం చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అన్నదానంలో పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేశ్, ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. రాయపోల్ గ్రామంలో ఎంపీటీసీ అచ్చన శ్రీశైలం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. తులేకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు ఆధ్వర్యంలో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
చేవెళ్లటౌన్ : ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ…బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, సంఘం కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు ఆంజనేయులు, చింటు, సత్తి, మహేందర్, అంబేద్కర్ కమిటీ సభ్యులు ఉన్నారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంతో పాటు పట్టణ ముఖ్యకూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అన్నారు. అదే విధంగా వివిధ పార్టీ నాయకులు, దళిత, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. పట్టణంలోని ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, ప్రధాన కార్యదర్శి జనార్ధన్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. పట్టణ ముఖ్యకూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి మాలమహానాడు నాయకులు నివాళులర్పించారు.
కేశంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ విశాలశ్రావణ్రెడ్డి, కొందుర్గు, చౌదరిగూడ మండలాలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్సుందర్రెడ్డి, నాయకులు రఘు, శ్రీకాంత్రెడ్డి, చెన్నయ్య, బాలరాజు, జమృత్ఖాన్, బస్వం, శ్రీనివాస్, ముబారక్ఖాన్, సిద్ధార్థ, రవి, శ్రీను, గోపాల్, జగన్, శ్రీధర్, రాములు, గోపాల్, రవి, ఖధీర్, మధు, అంజి, అశోక్, అసోసియేషన్ సభ్యులు స్వరాజ్బాబు, గోపాలస్వామి, శివనాగయ్య, వెంటకటయ్య, రమదేవి, నారాయణ, నర్సింహులు, నర్సింహ, రాము, మాలమహానాడు నాయకులు జనార్ధన్, వెంకటయ్య, రామకృష్ణ, కృష్ణ, మహేశ్, బుచ్చిబాబు, అర్జున్కుమార్, లక్ష్మణ్, శేఖర్, జంగయ్య పాల్గొన్నారు.
పట్టణ ముఖ్యకూడలిలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రామకృష్ణ, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, రాజేశ్వర్, అంతయ్య, సర్వర్పాషా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు నారాయణరెడ్డి, శంకర్, యుగేందర్, నర్సింహ, యాదగిరి, గోపాల్ పాల్గొన్నారు.
షాద్నగర్ : చౌదరిగూడ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ ఆఫీస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అబేంద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్, తంగేళ్లపల్లి, కొందుర్గు మండల కేంద్రం, కేశంపేట మండల కేంద్రంతో పాటు పోమాలపల్లి, వేముల్నర్వ, కొండారెడ్డిపల్లి, తొమ్మిదిరేకుల, కొత్తపేట, ఎక్లాస్ఖాన్పేట, సంగెం, ఇప్పలపల్లి గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.
కార్యక్రమంలో నాయకులు శ్రీధర్రెడ్డి, నాయకులు కృష్ణ, రామకృష్ణరెడ్డి, ప్రభాకర్రెడ్డి, శేఖర్, మల్లయ్య, యాదయ్య, బసవయ్య, చెన్నయ్య, గోపాల్, నర్సింహ్మరెడ్డిలు, బాబురావు, వెంకటేశ్, రామచంద్రయ్య, మల్లేశ్, శ్రీరాములు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
యాచారం : నందివనపర్తిలో జై భీమ్ ఎడ్యూకేటెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గున్గల్ గ్రామంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మంచాల : మండల పరిధిలోని ఆరుట్ల, మంచాల, జాపాల, నోముల, లింగంపల్లి, లోయపల్లితో పాటు పలు గ్రామాల్లో అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు.
అబ్దుల్లాపూర్మెట్ : అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని దళిత సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రేఖామహేందర్గౌడ్, జడ్పీటీసీ దాస్గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్పాషా, నాయకులు మహేందర్గౌడ్, నర్సింహ, జగన్, బాబు, రవీందర్, యాదగిరి, శివకుమార్గౌడ్, యాదగిరి, మహేశ్, శివ, శ్రీశైలంగౌడ్, లింగంగౌడ్, యువజన సంఘాల యువకులు ఉన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రంలో వివిధ పార్టీల, యువజన సంఘాల ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్తోపాటు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదే విధంగా మండల కేంద్రంలో అంబేద్కర్, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, నర్సింహా, బీచ్చానాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు భాస్కర్రెడ్డి, చందోజీ, నర్సింహా, హన్మానాయక్, రామచంద్రయ్య, కృష్ణ, మహేశ్, అంజి, లాయక్అలీ, వెంకటేశ్, భీక్యానాయక్, యాదగిరిరెడ్డి, జహంగీర్అలీ, భిక్షపతి, రాజు, నరేశ్నాయక్, రాజేందర్, మల్లేశ్గౌడ్, శ్రీకాంత్, రాములు పాల్గొన్నారు.
షాబాద్ : మండలంలోని షాబాద్, హైతాబాద్, నాగరగూడ, సర్దార్నగర్, తిమ్మారెడ్డిగూడ, బోడంపహాడ్ తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో అంబేద్కర్ జయంతిని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమంలో మండల ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పత్యానాయక్, మానయ్య, సింగల్విండో సీఈవో దేవెందర్, అంబేద్కర్ అధ్యక్షుడు మహేష్, సంఘం ప్రధాన కార్యదర్శి రమేశ్, ప్రచార కార్యదర్శి హఫీజ్, ఎమ్మార్పియస్ జిల్లా కార్యదర్శి మల్లేపోగు మల్లేశ్, మాజీ వార్డు సభ్యుడు అల్లాజీ, వివిధ సంఘాల నాయకులు రాము, నిరంజన్, మల్లయ్య, రమేశ్, కృష్ణనాయక్, కె.అల్లాజీ, సతీశ్, విజయ్, బాలు, రవీందర్, శివ, రమేశ్, సురేశ్నాయక్, కృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : అంబేద్కర్ జయంతిని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ముఖ్యఅతిథిగా హాజరై మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధాతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కౌన్సిలర్ అయిలయ్య, మంగమ్మ, అనురాధా, నాయకులు దశరథ, రమేశ్, శంకర్, బాబు, దర్శన్, దర్శన్, కుమార్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధా ఇంజాపూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
కమ్మగూడ వివేకానంద చౌరస్తాలో కౌన్సిలర్ అయిలయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు.
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట, కుంట్లూరు, పసుమాముల, తట్టిఅన్నారం, ఆర్కేనగర్ తదితర చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, బలరాం పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నాయకులు, యువజన సంఘలు ఆయా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు నివాళులర్పించారు.