తుర్కయంజాల్, డిసెంబర్ 30 : మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.శనివారం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ అధ్యక్షతన మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపాలిటీలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడానికి తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. అనంతరం ఆయన రూ.60 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత, బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్నాయక్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అయిలయ్య, కౌన్సిలర్లు మల్లేశ్, సిద్దాల జ్యోతి, వేముల స్వాతి, సంగీత, మాధవి, ఉదయశ్రీ, హరిత, కవిత, మంగమ్మ, కీర్తన, ధన్రాజ్, బాల్రాజ్, శివలింగం, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.