పరిగి, ఏప్రిల్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన పల్లెబాటలో భాగంగా మండలంలోని రాపోల్, ఖుదావంద్పూర్, నర్సయ్యగూడ, జాఫర్పల్లి, కాళ్లాపూర్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకొని వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. నర్సయ్యగూడకు బీటీ రోడ్డు వేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, స ర్పంచ్లు జంగయ్య, గోపాల్, నల్క జగన్, రాములు, ఎంపీటీసీలు ఉమాదేవి, రవి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సార్ వల్ల మాకు పింఛన్, బియ్యం వస్తున్నాయని, ఆయన సల్లంగుండాలి సార్ అని ఖుదావంద్పూర్కు చెందిన ఎల్లంపల్లి మల్లమ్మ దీవించారు. శనివారం పల్లెబాటలో భాగంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఖుదావంద్ పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి మల్లమ్మను పింఛన్ వస్తుందా అని ఎమ్మెల్యే అడుగగా పింఛన్, బియ్యం వస్తున్నాయన్నారు.