పరిగి, ఏప్రిల్ 18 : అభివృద్ధిలో గ్రామాలు పోటీ పడుతున్నాయని, దీంతో జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణ పల్లెలకు వస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొ న్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పరిగి మండలం గోవిందాపూర్, పోల్కంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లోని వీధులన్నీ తిరిగి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సదుపాయం, గ్రామాలకు బీటీ రోడ్డు, ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టామన్నారు.
నర్సయ్యగూడ నుంచి పోల్కంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. పోల్కంపల్లి నుంచి మరో రెండు గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ రహదారుల్లో రెండు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రెండు గ్రామాల్లో అవసరమైన మేరకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు.
అంతకుముందు రంగాపూర్ గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, నార్మాక్స్ డైరెక్టర్ రాంరెడ్డి, సర్పంచ్లు మధు సూదన్రెడ్డి, అనుసూజదేవి, నల్క జగన్, రాములు, ఎంపీటీసీ రవి, బీఆర్ఎస్ నాయ కులు, గ్రామస్తులు పాల్గొన్నారు.