గండీడ్, నవంబర్ 26: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కొంరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, అంచన్పల్లి, గండీడ్, రెడ్డిపల్లి, మన్సూర్ పల్లి, మన్సూర్పల్లి తండా, బల్సుర్గొండ, కొండాపూర్, పగిడ్యాల్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మూడు గంటల కరెం టు ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలో చించుకోవాలన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే రైతులకు కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామన్నారు. పదేండ్ల కిందట గ్రామాలు ఎట్ల ఉండె ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న రామ్మోహన్రెడ్డి తన పదవీ కాలంలో నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసిండు. ఎట్లున్న గ్రామాలు అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, హరిత హారం మొక్కలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు ఇలా అనేకమైన కార్యక్రమాలతో అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రత్యేక గ్రామ పంచాయతీల పాలన సౌలభ్యం కల్పించామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలందరూ సుభి క్షంగా ఉండాలని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధ్ది కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ది సంక్షేమాలను చూసి కారు గుర్తుకు ఓటేసి మరోసారి అసెంబ్లీకి పంపినట్లయితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాన్నారు. గండీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యానాయక్,
బిక్షపతి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచులు గోపాల్, చంద్రకళ, నర్సింహారెడ్డి, లక్ష్మిబాయి, శ్రీనివాస్, వనజ, అన్నసారపు రాణి, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి, నాయకులు గోపాల్రెడ్డి, రాంచ్రందారెడ్డి, వెంకటయ్య, చంద్ర య్య, రమేశ్రెడ్డి, రాజునాయక్, కృష్ణారెడ్డి, కరుణాకర్రెడ్డి, కొండారెడ్డి, గఫర్ఖాన్, ముఖ్బుల్, ఖాదర్, బాలవర్దన్రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.