ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 29 : గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తడిగా మారే మట్టిరోడ్లు, పెద్ద పెద్ద గోతులతో ప్రయాణించాలంటేనే నరకప్రాయంగా ఉన్న వీధులు, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీరోడ్లుగా మెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని దారులను సీసీరోడ్లుగా మారుస్తున్నది. రోడ్లు బాగాలేక పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులే నడవని దుస్థితి. మట్టి రోడ్లతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన గ్రామీణ ప్రజల కష్టాలు దశల వారీగా తొలగిపోతున్నాయి. గ్రామాల్లో చేపడుతున్న ఈ సీసీరోడ్ల పనులు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్నది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
అదే మాదిరిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ ఏడాది కూడా ప్రతి గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లను పూర్తిచేసేందుకు నియోజకవర్గంలోని 82 గ్రామాలకు ప్రభుత్వం రూ.9.48కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో ఇప్పటికే సీసీరోడ్లు ప్రారంభించి ముమ్మరంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పనులు చేపడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ గల్లీలో చూసినా బురద, మురుగునీరు, కలుపు మొక్కలతో దర్శనమిస్తుండేవి. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గల్లీ సీసీరోడ్లతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిపల్లె మెరిసిపోవటంతో పాటు ఉపాధిహామీ పథకం కింద కేటాయించిన నిధులతో సీసీరోడ్ల పనులు కొనసాగుతుండటంతో గ్రామీణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో
ఇబ్రహీంపట్నం : చర్లపటేల్గూడ రూ.10లక్షలు, దండుమైలారం రూ.74లక్షలు, ఎలిమినేడు రూ.20లక్షలు, కప్పాడు రూ.10లక్షలు, కర్ణంగూడ రూ.10లక్షలు, ముకునూరు రూ.7లక్షలు, నాగన్పల్లి రూ.10లక్షలు, నెర్రపల్లి రూ.8లక్షలు, పోచారం రూ.35లక్షలు, పోల్కంపల్లి రూ.15లక్షలు, రాయపోల్ రూ.30లక్షలు, తులేకలాన్ రూ.13లక్షలు, తుర్కగూడ రూ.14లక్షలు, ఉప్పరిగూడ రూ.15లక్షలు.
అబ్దుల్లాపూర్మెట్ : అబ్దుల్లాపూర్మెట్ రూ.20లక్షలు, అనాజ్పూర్ రూ.10లక్షలు, బాచారం రూ.10లక్షలు, బలిజగూడ రూ.10లక్షలు, బండరావిర్యాల రూ.10లక్షలు, బాటసింగారం రూ.10లక్షలు, చిన్నరావిర్యాల రూ.10లక్షలు, గండిచెరువు రూ.10లక్షలు, గౌరెల్లి రూ.10లక్షలు, గుంతపల్లి రూ.10లక్షలు, గఫర్గూడ రూ.10లక్షలు, కవాడిపల్లి రూ.10లక్షలు, లష్కర్గూడ రూ.10లక్షలు, ఇనాంగూడ రూ.10లక్షలు, మజీద్పూర్ రూ.10లక్షలు, పిగ్లీపూర్ రూ.10లక్షలు, కుత్బుల్లాపూర్ రూ.18లక్షలు, తారామతిపేట రూ.10లక్షలు.
మంచాల : ఆగాపల్లి రూ.10లక్షలు, ఆంబోతుతండా రూ.10లక్షలు, ఆరుట్ల రూ.20లక్షలు, అస్మత్పూర్ రూ.20లక్షలు, బండాలేమూర్ రూ.5లక్షలు, బోడకొండ రూ.15లక్షలు, చీదేడు రూ.5లక్షలు, చెన్నారెడ్డిగూడ రూ.8లక్షలు, చిత్తాపూర్ రూ.10లక్షలు, దాద్పల్లి రూ.5లక్షలు, జాపాల రూ.20లక్షలు, కాగజ్ఘాట్ రూ.5లక్షలు, కొర్రవానితండా రూ.10లక్షలు, లింగంపల్లి రూ.10లక్షలు, లోయపల్లి రూ.5లక్షలు, మంచాల రూ.15లక్షలు, నోముల రూ.10లక్షలు, పటేల్చెర్వుతండా రూ,.5లక్షలు, రంగాపూర్ రూ.10లక్షలు,
తాళ్లపల్లిగూడ రూ.10లక్షలు, తిప్పాయిగూడ రూ.5లక్షలు, ఎల్లమ్మతండా రూ.7.50లక్షలు.
యాచారం : అయ్యవారిగూడ రూ.10లక్షలు, చింతపట్ల రూ.20లక్షలు, చౌదర్పల్లి రూ.10లక్షలు, ధర్మన్నగూడ రూ.5లక్షలు, గడ్డమల్లయ్యగూడ రూ.10లక్షలు, గున్గల్ రూ.15లక్షలు, కేసీతండా రూ.10లక్షలు, కొత్తపల్లి రూ.10లక్షలు, కుర్మిద్ద రూ.10లక్షలు, మల్కీజ్గూడ రూ.15లక్షలు, మాల్ రూ.10లక్షలు, మంతన్గౌరెల్లి రూ.10లక్షలు, మేడిపల్లి రూ.5లక్షలు, మొంగౌరెల్లి రూ.10లక్షలు, నల్లవెల్లి రూ.10లక్షలు, నానక్నగర్ రూ.10లక్షలు, నందివనపర్తి రూ.20లక్షలు, నజ్దిక్సింగారం రూ.10లక్షలు, తక్కళ్లపల్లి రూ.9లక్షలు, తక్కళ్లపల్లితండా రూ.10లక్షలు, తమ్మలోనిగూడ రూ.10లక్షలు, తాటిపర్తి రూ.10లక్షలు, తులేఖుర్దు రూ.5లక్షలు, యాచారం రూ.15లక్షలు.
ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ధి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి నల్లాలు, వీధిదీపాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అడిగిన వెంటనే నిధులు కేటాయించటం సంతోషకరం.
– కృపేశ్, ఎంపీపీ ఇబ్రహీంపట్నం
గ్రామాల్లో అభివృద్ధి పరుగులు
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రం గ్రామాలను అభివృద్ధిలో ముందుకు నడిపించేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు శుభ్రంగా ఉండటంతో పాటు అభివృద్ధి, హరితహారం కూడా అదేరీతిలో కొనసాగుతున్నాయి. ప్రతిఏటా గ్రామాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– చెరుకూరి మంగ, ఎంపీటీసీ పోల్కంపల్లి