HomeRangareddyMla Kishan Reddy Who Went By Bus With The Donors
తరలిన గులాబీ దండు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం చేరుకున్నారు.
పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు
అన్నదాతలతో కలిసి బస్సులో వెళ్లిన ఎమ్మెల్యే కిషన్రెడ్డి
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలమన్న ప్రజాత్రినిధులు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న బస్సుల్లో వారంతా బయలుదేరారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కూడా రైతులతో పాటు బస్సులోనే బయలుదేరి రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్కుమార్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీలు కృపేశ్, నర్మద, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బుగ్గరాములు, చీరాల రమేశ్, రమేశ్గౌడ్, కిషన్గౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివెల్లారు.
మారనున్న రైతుల ఆర్థిక స్థితిగతులు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు మారనున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి బయలుదేరిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అత్యధిక భూములకు తాగునీరు అందనుందని ఆయన అన్నారు. ఈ ప్రాంత రైతులకు రంగారెడ్డి -పాలమూరు ఎత్తిపోతల పథకమే సరైందని ఆయన అన్నారు.
సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి
షాబాద్, సెప్టెంబర్ 16 : తెలంగాణలో వ్యవసాయాన్ని సస్య శ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శనివారం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సీఎం సభకు చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ప్రజలు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి తరలివెళ్లారు. పండుగ వాతావరణంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. నియోజకవర్గం నుంచి ప్రజలు, అధికారులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ప్రాజెక్టు వద్దకు వెళ్లే ప్రజలకు ఉదయం టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్ రావు, మహేందర్ రెడ్డి, గోపాల్, వాసుదేవ్ కన్నా పాల్గొన్నారు.
ఆమనగల్లు : మండంలోని 13 గ్రామ పంచాయతీలు, 1 మున్సిపాలిటీ నుంచి 25 బస్సులు, 100 ప్రైవేట్ వాహనాల్లో పెద్ద ఎత్తున బయలు దేరారు. ఈ వాహనాలకు బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ జెండా ఊపి ప్రారంభించారు. కడ్తాల్ మండలం నుంచి 20 బస్సులు ,100 కార్లలో బయలు దేరారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. తలకొండపల్లి మండలం నుంచి 30 బస్సులు, 50 కార్లలో, మాడ్గుల మండలం నుంచి 33 బస్సులు, 60 కార్లలో బయలుదేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్, సింగల్విండో చైర్మన్ వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నిర్మల , జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ముజఫర్, మండల అధ్యక్షుడు అర్జున్రావు, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, ఏర్పుల జంగయ్య, నాయకులు సయ్యద్ ఖలీల్, కోట పెద్ద శ్రీను, వెంకటేశ్ , చుక్క నిరంజన్, గంప శ్రీను, రాజేందర్, భారతమ్మ, యాదయ్య, రాజవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
119 బస్సులు, 400కు పైగా వాహనాలు
షాద్నగర్ : సీఎం కేసీఆర్ బహిరంగ సభకు షాద్నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామ పంచాయతీల నుంచి తగిన ఏర్పాట్లు చేశారు. 119 ఆర్టీసీ బస్సులతో పాటు మరో 400కు పైగా ఇతర వాహనాల్లో తరలి వెళ్లారు. షాద్నగర్ నుంచి ఉదండాపూర్, కర్వేన, ఒట్టెం రిజర్వాయర్ల మీదుగా సింగోటం సభకు వెళ్లారని స్థానిక నాయకులు తెలిపారు. సభకు వెళ్లిన వారికి అన్ని రకాల ఏర్పాట్లును చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్యాదవ్, కొత్తూరు మున్సిపల్ చైర్మన్ లావణ్య, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఫరూఖ్నగర్ ఎంపీపీ ఖాజా ఇద్రీస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్నాయక్, మురళీధర్రెడ్డి, మెండె కృష్ణ, శ్రీధర్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జడ్పీటీసీలు ఎమ్మె శ్రీలత, బంగారు స్వరూపలతో పాటు పలువురు ప్రముఖ నాయకులు సభకు తరలిన వాహనాలు, వసతులను పర్యవేక్షించారు.