మొయినాబాద్, డిసెంబర్ 8 : అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావేశం జరిగింది. వివిధ వివిధ శాఖల వారీగా 20 అంశాలపై చర్చించారు. అధికారులు వారి శాఖల వారీగా చేపట్టిన పనులను సమావేశంలో సభ్యులకు వివరించారు.
కొంత మంది సభ్యులు ఆయా శాఖలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు కొన్ని పనులపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ మందడి చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ ఎం మమత, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్ గౌతం, వ్యవసాయ శాఖ అధికారి రాగమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.