నవాబుపేట, మే 2: బీఆర్ఎస్ నుంచి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య ఓటర్లను కోరారు. నవాబుపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలు మారిన వ్యక్తులను ఓడించి తగ్గిన బుద్ధి చెప్పాలన్నారు.
నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ వెళ్లడంలేదని డబ్బులకు కక్కుర్తి పడిన కొంతమంది తమ స్వలాభం కోసం వెళ్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.