చేవెళ్ల రూరల్, డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుపై చర్చించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని, ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో దేవునిఎర్రవల్లి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, ఎదిరె మాణిక్యం, మాజీ సర్పంచ్ విఠల్రెడ్డి ఉన్నారు.