చేవెళ్లటౌన్, ఆగస్టు 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్లకు 100 పడకల దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేయడంతోపాటు వైద్య పరికరాల కోసం రూ.17.50కోట్ల నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.