ఆమనగల్లు, ఆగస్టు 3 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వరకు మెట్రో రైలును పొడిగించనున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. హైదరాబాద్లో గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఇటీవల మెట్రో రైలు సౌకర్యాన్ని హైదరాబాద్ నుంచి కందుకూరు వరకు పొడిగించారని, కడ్తాల్ సమీపంలో ముచ్చర్ల ఫార్మాసిటీ, ఫార్మా యూనివర్సిటీ నిర్మిస్తున్న నేపథ్యంలో కడ్తాల్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును అదేశించి మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీఎస్ రెడ్డితో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.