కడ్తాల్, జూన్ 28 : గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు సురిగె జంగయ్యగౌడ్ ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సర్పంచ్ భాగ్యమ్మ ఎమ్మెల్యేకు జరిగిన ఘటన గురించి వివరించారు. ఎమ్మెల్యే సహకారంతో బాధితుడికి రూ.5 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం బాధితుడికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్ నుంచి కడ్తాల్ వరకు సబ్-అర్బన్ బస్సును నడపాలని కడ్తాల్ సర్పంచ్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశాడు. మండల కేంద్రం నుంచి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు హైదరాబాద్కు రాకపోకలు జరుపుతారని, కడ్తాల్ మీదుగా నడిచే జిల్లా బస్ పాసులకు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తున్నదని ఎమ్మెల్యేకు విన్నవించాడు. హైదరాబాద్ నుంచి కందుకూరు వరకు నడిచే సబ్-అర్బన్ బస్సులను కడ్తాల్ వరకు నడిపేందుకు చొరవ తీసుకోవాలని సర్పంచ్ కోరారు. అదే విధంగా గ్రామంలోని 2, 3, 12 వార్డులకు తాగునీటిని అందించేందుకు లక్ష లీటర్ల నీటి ట్యాంక్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మండలానికి చెందిన ఆండాళుకు రూ.20 వేలు, వెంకటమ్మకు రూ.34, 500, శివకు రూ.10 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, బిచ్చానాయక్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్నాయక్, నాయకులు పత్యానాయక్, రాజేందర్యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.