ఆమనగల్లు, అక్టోబర్ 20 : ఎన్నికల వేళ అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలని ఆమనగల్లు మండల, మున్సిపాలిటీ ప్రజలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో పాటు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, కల్వకుర్తి ఎన్నికల ఇన్చార్జి గోలి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పూజలు చేశారు. బీఆర్ఎస్ మైనార్టీ జిల్లా నాయకుడు సయ్యద్ ఖలీల్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు దట్టి కట్టారు. అనంతరం ఏఎంసీ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్ తన సొంత నిధులతో చేయించిన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన రహదారి గుండా కళాకారుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీగా మండల పరిషత్ ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్కు ద్రోహం చేసి, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తున్నాడని, ఆయనకు కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు అని ప్రజలను మోసం చేయాలని చూస్తుందన్నారు. బీజేపీ నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా ఉండి ఎంత మంది బీసీలకు న్యాయం చేసిండో చెప్పాలన్నాడు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, కల్వకుర్తి ఎన్నికల ఇన్చార్జి గోలి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చేసి చూపించిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన జరుగాలంటే సీఎం కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలన్నారు. కార్యక్రమంలో మండల జడ్పీటీసీ నేనావత్ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, మండల, పట్టణ అధ్యక్షుడు అర్జున్ రావు, నేనావత్ పత్యానాయక్, నిట్ట నారాయణ, ఎంపీటీసీ కుమార్, కౌన్సిలర్లు కమఠం రాధమ్మ, సోని, బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ విభాగం నాయకుడు సయ్యద్ ఖలీల్, బీఆర్ఎస్ నాయకులు కేశవులు, శ్రీనివాస్, కమఠం వెంకటయ్య, సాయిలు, ఆంజనేయులు, పరమేష్, రాజు, శంకర్, పరమేశ్, యువజన విభాగం నాయకులు ప్రసాద్, వెంకటేశ్, రమేశ్, సతీశ్, భాస్కర్, రమేశ్, విక్రం, కంబాలపల్లి అల్లాజీ, శ్రీను, మైసయ్య, వెంకటయ్య, రమేశ్నాయక్, రేపని విజయ్, జంతుక శివ, శ్రీరామ్ పాల్గొన్నారు.