కడ్తాల్, ఏప్రిల్ 5 : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జైపాల్యాదవ్, అనితారెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యిందని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్రామాల్లో చర్చ జరపాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే బీఆర్ఎస్ ఎజెండా అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కొంత మంది పగటి వేషగాళ్లు గ్రామాలకు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను బీజేపీపాలిత రాష్ర్టాల్లో అమలు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని ఎమ్మెల్యే సవాలు చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం అడ్టుకుంటున్నదని ఆరోపించారు. జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ పేదలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అంతకుముందు ముద్విన్ గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఏఎంసీ చైర్మన్ విజయ్గౌడ్, సర్పంచ్లు యాదయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, భారతమ్మ, పూజా, లోకేశ్నాయక్, భాగ్యమ్మ, కమ్లీబీచ్చానాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, మంజుల, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, ఉప సర్పంచ్లు వినోద్, ముత్యాలు, నర్సింహ, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజు, గంప శ్రీను, రాఘవరెడ్డి, గోపాల్, జంగయ్యగౌడ్, లక్ష్మయ్య, నర్సింహాగౌడ్, మహేశ్, సాబేర్, భాస్కర్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకట్యాదవ్, జంగయ్య, నరేశ్, రాజేందర్యాదవ్, నరేశ్, చంద్రమౌళి, సతీశ్, శివ పాల్గొన్నారు.