షాద్నగర్, ఫిబ్రవరి 15 : నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలో ఫరూఖ్నగర్ మండల పరిషత్ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ నిధులను కేటాయిస్తున్నదన్నారు. ఎంపీటీసీలు, గ్రామాల సర్పంచ్లు అడిగిన పలు ప్రశ్నలు, సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఫరూఖ్నగర్ మండలం రామేశ్వరం రామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. దేవాలయం ప్రాంగణంలో స్వాగత తోరణం, ముఖద్వారం నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. స్వామి వారి జాతరను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను షాద్నగర్ పట్టణంలోని సేవాలాల్ మహారాజ్ దేవాలయం ఆవరణలో, కొందుర్గు మండలం అయోధ్యపూర్ తండాలో ఘనంగా నిర్వహించారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాంబాల్నాయక్, మిట్టు, రాజూనాయక్, బాలు, మంగులాల్నాయక్, గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.