కొత్తూరు, నవంబర్ 16: గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల, కొడిచెర్ల, కొడిచెర్లతండా, ఎస్బీపల్లి, సిద్దాపూర్ వైఎం తండాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట పెంజర్లలో గ్రామ కమిటీ అధ్యక్షుడు చెక్కల సత్తయ్య, మాజీ సర్పంచ్ బాల్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కొడిచెర్లలో గ్రామ అధ్యక్షుడు జంగయ్యయాదవ్, ఎంపీటీసీ రవీందర్రెడ్డి ఆధ్వర్యలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అనంతరం కొడిచెర్ల వైఎం తండాలో అరుణారమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్బీ పల్లిలో జడ్పీటీసీ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో, సిద్దాపూర్లో సర్పంచ్ వడ్డె తులసమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో, వైఎం తండాలో సర్పంచ్ జంపుల సంతోష్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదన్నర ఏండ్లలో చేసి చూపెట్టిందన్నారు. ప్రజలు మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హ్యాట్రిక్ కొడ్తారని స్పష్టం చేశారు. అత్యధిక మెజార్టీ వచ్చే దిశగా ప్రచారం కొనసాగుతున్నదన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో రోడ్ల నుంచి మొదలు పెట్టి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని వివరించారు. కార్యక్రమలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, దేవేందర్యాదవ్, మేకగూడ పీఏసీఎస్ చైర్మన్ మంజులారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పంపుల నర్సింహగౌడ్, దేశాల భీమయ్య, దేశాల జైపాల్, కడాల శ్రీశైలం, కుమ్మరిగూడెం పాండు, మహేశ్ పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : తెలంగాణ రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మహిళా కౌన్సిలర్లు కొందూటి మహేశ్వరి, విశాల, మాధురితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. షాద్నగర్ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నందకిశోర్, సుజీవన్, రాఘవేందర్రెడ్డి, రాజు, మీనా, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.