ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఆదివారం అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులతోపాటు అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఊరూరా.. ఇంటింటికీ వెళ్లి జనంతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. గులాబీ దళం ఏ ఊరుకెళ్లినా జనం నీరాజనం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతోపాటు సమావేశాలు, ఆశీర్వాదసభలు, ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
షాద్నగర్రూరల్, అక్టోబర్ 29: షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం.. ప్రజా సంక్షేమమే లక్ష్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే వై.అంజయ్యయదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట, పీర్లగూడ, దొంతికుంటతండా, కందివనం, ఎల్లంపల్లి, మొగిలిగిద్ద, రంగంపల్లి, రాసుమలగూడ, నాగులపల్లి గ్రామాల్లో ఆదివారం ముమ్మ రంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సర్కారు అమలు చేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోలోని పథకాలను గ్రామస్తులకు వివరిస్తూ ఆయన ఓట్లను అభ్యర్థించారు.
ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే అభ్యర్థికి పూర్తి మద్దతు పలకడంతో గ్రామాలు, తండాలు గులాబీమయంగా మారాయి. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రిస్ అహ్మద్, దేవునిపల్లి సర్పంచ్ రాఘవేందర్గౌడ్, పార్టీ మండల ఆధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, రాంబల్నాయక్, వెంకట్రెడ్డి, వెంకటేశ్గౌడ్, అర్లయాదయ్య, రాజు, మల్లేశ్ పూజా రి, లింగంయాదవ్, సురేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : కాంగ్రెస్కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారమవుతుందని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మొద్దని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ప్రజలను కోరారు. షాద్నగర్ పట్టణంలోని 7వ వార్డులో కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఎన్నికల మ్యానిఫెస్టు పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈశ్వర్రాజు, వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, జీటీ శ్రీనివాస్, అంతయ్య, నాయకులు శంకర్, యాదగిరి, రాఘవేందర్రెడ్డి, రఘు, సిద్ధు, వెంకటేశ్, రాజు, బాలు, భాస్కర్, కాలనీవాసులు లింగం, పరమేశ్, సింహయ్య, సంగయ్య, వెంకటేశ్, అహ్మద్, భాస్కర్, అశోక్, సిద్ధిక్, శివ, సాయి, శ్రీశైలం, యువకులు పాల్గొన్నారు.
కేశంపేట : మండలంలోని గ్రామాల్లో షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల ప్రచారం జోరందుకున్నది. మండలంలోని 29 గ్రామాల్లో పార్టీ నాయకులు, అభిమానులు ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంజయ్యయాదవ్కు ఓటు వేసి భారీ మెజారిటితో గెలిపించాలని కోరుతున్నారు. కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తూరు : ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట ముంచ డం ఖాయమని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సదానందంగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్రెడ్డి, గోవింద్రెడ్డి, దేవేందర్యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాసులు, జనార్దనాచారి, యాదయ్య, లక్ష్మయ్మ, శివకుమార్, రవీనాయక్, భాస్కర్గౌడ్, శ్రీనుచారి, ఆంజనేయులుగౌడ్, శివకుమార్, రవీనాయక్, వెంకటేశ్, రవీందర్యాదవ్, రాఘవేందర్, గణేశ్ యాదవ్, రాజు యాదవ్, నరసింహయాదవ్, ప్రవీణ్ పాల్గొన్నారు.